అక్షర సుగంధం కవిత్వం; ర: దేవలపల్లి సునంద; పు: 104; వె: Rs100; ప్ర: పాలపిట్ట బుక్స్, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్పేట, హైదరాబాదు-36, 98487 87284
ఎమర్జెన్సీ జ్ఞాపకాలు వ్యాసాలు; ర: వేదుల నరసింహం; పు: 160; వె: Rs100; ప్ర: సాహిత్య నికేతన్, ఏలూరు రోడ్, గవర్నరుపేట, విజయవాడ -520002, 94406 43348
ఆత్మీయతకు ప్రతిరూపం హల్దేకర్జీ వ్యాసాలు; ప్రచురణ: శ్రీ భోగాది దుర్గాప్రసాద్ స్మరక సమితి; పు: 176; వె: Rs120; ప్ర: సాహిత్య నికేతన్, కేశవనిలయం, హైదరాబాదు, 040 27563236
కవీంద్ర మోక్షం కవిత్వం; ర: రఘుశ్రీ; పు: 110; వె: Rs100; ప్ర: వి.శ్రీలక్ష్మి, 2-1-421, ఫ్లాట్ నం.202, సాయినీ నిలయం, వీధి నం.4, నల్లకుంట, హైదరాబాదు -500004, 92471 08893
మహాభారతం - మతదర్శనం-1; ర: చంద్రశేఖరరెడ్డి చేగిరెడ్డి; పు: 228; విరాళం: Rs220; ప్ర: రచయిత, మొహిదీన్పురం, అర్ధవీడు మండలం, ప్రకాశం జిల్లా-523336, 98663 09589
భారతదేశంలో విదేశీ ముస్లిం పాలన వ్యాసాలు; ర: డా।। బి.సారంగపాణి; పు: 350; వె: Rs250; ప్ర: సాహిత్య నికేతన్, 3-4-852, బర్కత్పుర, హైదరాబాదు, 040 27563236
భారతదేశ చరిత్రలో ఆరు స్వర్ణ పత్రములు వ్యాసాలు; ర: దామోదర సావర్కర్; పు: 368; వె: Rs250; ప్ర: సాహిత్యనికేతన్, ఏలూరురోడ్, గవర్నరుపేట, విజయవాడ, 94406 43348
భూమిపుత్రుడు కవిత్వం; ర: విడదల సాంబశివరావు; పు: 112; వె: Rs100; ప్ర: రచయిత, 3-173/1, పండరీపురం, చిలకలూరిపేట - 522616, గుంటూరు జిల్లా, 98664 00059
చైనాలోని పరిణామాలు భారత-చైనా సంబంధాలపైన...; ర: దేవులపల్లి వెంకటేశ్వరరావు; పు: 296; వె: Rs150; ప్ర: పోరునేల, హైదరాబాదు, 77028 88998, ప్రముఖ పుస్తక కేంద్రాలు
మహాప్రవక్త ముహమ్మద్ ఆధ్యాత్మికం; ర: అలపర్తి పిచ్చయ్య చౌదరి; పు: 100; వె: అమూల్యం; ప్ర: రచయిత, 42/169, జయనగర్ కాలనీ, కడప - 516002, 91770 13845
పద్య సిందూరం పద్యసాహిత్యం; ర: ఐతా చంద్రయ్య; పు: 72; వె: Rs80; ప్ర: రచయిత, ఇం.నం.4-4-11, శేర్పూర, సిద్ధిపేట - 502103, 093912 05299
యక్ష ప్రశ్నలు మహాభారతం; ర: కప్పగంతు వెంకట రమణమూర్తి; పు: 32; వె: Rs35; ప్ర: గ్లోబల్ న్యూస్, బి2, ఎఫ్12, రామరాజా నగర్, సుచిత్రా సెంటర్, సికింద్రాబాదు-67, 92461 65059
విజయ సోపానాలు కవిత్వం; ర: ఎం.ఎన్.విజయకుమార్; పు: 64; వె: Rs50; ప్ర: రచయిత, పాఠశాల సహాయకులు, హిందీ, 14-5-209/5, మధురానగర్, మహబూబ్నగర్, 97031 86814
నారీ సంస్కృతి వ్యాసాలు; ర: డా।। ఎన్.శాంతమ్మ; పు: 114; వె: Rs100; ప్ర: రచయిత్రి, ఫ్లాట్ నం.302, ప్రశాంత్ టవర్స్, రైల్వే స్టేషన్ రోడ్, కర్నూలు-518002, 99080 58172
శాంత తరంగిణి వ్యాసాలు; ర: సి.రోజమ్మ; పు: 56; వె: ఉచితం; ప్ర: రచయిత్రి, హెడ్, సెయింట్ జోసెఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, సుంకేశుల రోడ్, కర్నూలు-518002, 99122 56565
భలే మంచిరోజు న్యూమరిక్కులు; ర: డా।। రమణ యశస్వి; పు: 154; వె: Rs100; ప్ర: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి, విజయవాడ-3, 96188 48470
మహోన్నత శిఖరాలు కవితా మాలిక; ర: వావిలిపల్లి రాజారావు; పు: 184; వె: Rs100; ప్ర: వావిలిపల్లి సుజాత, గాంధీనగర్ వీధి, పొందూరు, శ్రీకాకుళం జిల్లా, 99636 06391
గుమ్మటాలు బాలల గీతాలు; ర: డా।। వడ్డి విజయసారథి; పు: 60; వె: Rs60; ప్ర: సాహిత్య నికేతన్, విజయవాడ, 94406 43348; సాహిత్య నికేతన్, హైదరాబాదు, 040 27563236
రామణీయకం పద్యాలు; ర: డి.రాములు (రాము); పు: 80; వె: అమూల్యం; ప్ర: రచయిత, 24సి-3-22, మంచినీళ్ల తోట, వినాయకగుడి వీధి, పత్తేబాద, ఏలూరు-534002, 94403 76688
మరణానంతర జీవనం ఆధ్యాత్మికం; ర: డా।। పెద్దాడ వేంకట లక్ష్మీ సుబ్బారావు; పు: 34; వె: Rs10; ప్ర: రచయిత, 204, సాయి ఎన్క్లేవ్, లంకవీధి, విజయనగరం, 94410 58797
రచయిత: దేవనపల్లి వీణావాణి; పుటలు: 151; వెల: Rs150; ప్రతులకు: సిరుమళ్ల హరికృష్ణ, 24-3-29, దర్గా ఖాజీపేట, హన్మకొండ, వరంగల్-506003; ప్రముఖ పుస్తక కేంద్రాలు,
దేవనపల్లి వీణావాణి తెచ్చిన రెండో కవితా సంపుటి శిలాఫలకం. ఇందులో డెబ్బై కవితలున్నాయి. అధిక భాగం ప్రకృతికి సంబంధించిన కవితలే. ‘మంత్రం’ అనే కవితలో ‘మెదడులోకి మెల్లిగా ఇంకుతున్న/ మూడక్షరాల మంత్రం/ మర్చిపో’ అంటారు. శిలాఫలకం కవిత ‘ఒంటిమీద రాతలు/ అరిగిపోకపోయినా/ ఏకాకిలా ఇలా ఎన్నాళ్లు? మూలగ వలసి ఉందో’ అంటూ శిలాఫలకం ఆత్మఘోషను వినిపిస్తుంది. కవితలన్నీ చదవదగినవే.
- భ్రమరాంబ
రచయిత: కొల్లారపు ప్రకాశరావు శర్మ; పుటలు: 172; వెల: Rs875; ప్రతులకు: రచయిత, కొల్లారపు జలజారాణి, 9 ప్లోషేర్, స్టాఫర్్్డ, అమెరికా.
పద్యరచనా పద్ధతులను పదుగురు నేర్చుకుని, తెలుగు పద్యరచన పదికాలాల పాటు నిలిచేలా చేయాలనే తలంపుతో రచించిన గ్రంథం ఇది. ఇందులో వారానికి ఒక్కొక్క పాఠం చొప్పున 10 వారాలకు 10 పాఠాలు, వాటితో పాటు 300పైగా ప్రశ్నోత్తరాలు, 128 పద్యాలకు గణ విభజన అభ్యాసాలు, అవధానాలకు సంబంధించిన వర్ణన, సమస్యా పూరణాలు కూర్చారు. పద్య రచనాసక్తి గల వర్ధమాన కవులకు, విద్యార్థులకు ఉపయుక్తం.
- మల్లేశ్వరరావు
రచయిత: పువ్వాడ తిక్కన సోమయాజి; పుటలు: 253; వెల: Rs200; ప్రతులకు: రచయిత, నం.97, ఎల్ఐసీ కాలనీ, విజయవాడ-8, 98856 28572; విఠల్ పువ్వాడ, బెంగళూరు, 78997 27850
మన దేశంలోని రామాయణాల సంఖ్య రెండు వందలకు పైమాటే. ఆ పరంపరలో పువ్వాడ తిక్కన సోమయాజి పిబరే రామరసమ్ రామ కథను రమ్యంగా రచించి అందించారు. ఇందులో సూర్యోదయ వర్ణన తిక్కన సోమయాజి విరాటపర్వంలో చేసిన ‘నీరజాకరములు నిష్ఠమై చేసిన భవ్య తపంబుల ఫలమ నంగ’ పద్యాన్ని స్ఫురింపజేస్తుంది. సరళ గ్రాంథికంలో ఛందోబద్ధంగా సాగిన ఈ రచన అందరూ ఆస్వాదించదగింది.
- సత్యదేవ్
రచయిత: జెన్ని వరదరాజు; పుటలు: 104; వెల: Rs100; ప్రతులకు: రచయిత, రీసెర్చ్ స్కాలర్, ద్రవిడ యూనివర్సిటీ, కుప్పం, 94935 81196; ప్రముఖ పుస్తక కేంద్రాలు
ప్రముఖ కవి శిఖామణి వెలువరించిన మొదటి కవితా సంపుటి ‘మువ్వల చేతికర్ర’ గురించి సిద్ధాంత వ్యాసంగా జెన్ని వరదరాజు రాసిందే మువ్వల చేతికర్ర - తాత్త్వికత. ఇందులో శిఖామణి జీవితం, ఆయన సామాజిక సాహిత్య నేపథ్యం, కవితా సంపుటిలోని తాత్త్వికత, మానవతావాదం, వివిధ కవితా వస్తువులతో పాటు వర్తమాన కవిత్వంలో శిఖామణి ముద్రకు సంబంధించి పరిశోధనాత్మక వ్యాసాలున్నాయి.
- సంతోష్కుమార్
రచయిత: అయల సోమయాజుల రామజోగారావు; పుటలు: 174; వెల: Rs250; ప్రతులకు: అక్షర కౌముది పబ్లికేషన్స్, శ్రీవెంకటేశ్వర కాలనీ, షీలా నగర్, విశాఖపట్నం-530012, 94946 67378
సంగీతం, సాహిత్యం, శాస్త్రీయ- జానపద నృత్యాలు, రంగస్థల- చిత్రకళలు లాంటి రంగాల్లో నిష్ణాతులైన కళాకారులు ఎందరో ఉన్నారు. వాళ్లలో ఓ 32 మంది కళాకారుల ప్రతిభాపాటవాలను తెలుపుతూ కళాకదంబం వ్యాస సంపుటిని అందించారు రచయిత. ఆడంబరం లేని వాక్య నిర్మాణంతో పాఠకులను అలరిస్తూ రాశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి మేడిది, అపురూప చిత్రాల- అబ్బూరి లాంటి ప్రముఖుల పరిచయాలతో గ్రంథాన్ని ఆవిష్కరించారు.
- శాంతి జలసూత్రం
రచయిత: ఆచంట వి.సుబ్రహ్మణ్యం; పుటలు: 140; వెల: Rs100; ప్రతులకు: రచయిత, 111, పార్థసారథి నగర్, శ్రీరామచంద్ర మిషన్, రాజీవ్ హైవే, తూముకుంట, సికింద్రాబాదు, 94403 11399
కన్నతల్లి, ఉన్నఊరు జీవితాంతం వెంటా డుతూ ఉంటాయి. గడిచిన కాలపు ఆనవాళ్లని స్మరిస్తూ కార్టూనిస్టు ఆచంట వి.సుబ్రహ్మణ్యం డేస్ ఆఫ్ 1970గా తెచ్చిన ఈ చిరుపొత్తంలో కథలన్నీ జ్ఞాపకాలే. బడి రోజులనాటి సరదాలనీ, కళాశాల చదువుల్లో చిలిపితనాలనీ, పల్లెటూరు మమతానురాగాలనీ బొమ్మ కట్టించే ఈ కథల్లో జీవన మాధుర్యం పొడచూపు తుంది. పత్రికల్లోనూ, ఫేస్బుక్లోనూ ప్రచురితమైన ఈ కథలను బొమ్మలతో సహా ప్రచురించడం విశేషం.
- సాహితి
రచయిత: కొప్పోలు మోహనరావు; పుటలు: 120; వెల: Rs100; ప్రతులకు: రచయిత, ఫ్లాట్ నం.101, పరిమళ సదన్, కమలానగర్, దిల్సుఖ్నగర్, హైదరాబాదు-60, 98668 99047
కొప్పోలు మోహనరావు రాసిన కవితా సంపుటి ఒంటి నిట్టాడి గుడిసె. ఇందులో మొత్తం 24 కవితలున్నాయి. చాలా కవితలు దళిత సాహిత్య శాఖకు చెందినవే. లాక్డౌన్ ప్రభావం మీద ‘లాక్డౌన్లో మా కాలనీ, వలస జీవులు.. వృద్ధాశ్రమాల మీద ‘దేశపు మర్యాదస్తులు’ లాంటి కవితలు అందించారు. ‘సడలిన దేహాల బరువులకంటే/ వృద్ధాశ్రమాల్లో కొడుకులు వదిలిపోయిన/ ఏకాంతపు ఒంటరితనమే ఎక్కువ బరువు’ ఇలా అన్నీ ఆర్ద్రత నింపుతాయి.
- సునంద
రచయిత: ఆదూరి హేమావతి శ్రీనివాసరావు; పుటలు: 296; వెల: Rs100; ప్రతులకు: రచయిత, విల్లా నం.22, ప్రైడ్ ఆర్చిడ్, తూబరహళ్లి, బెంగళూరు-66, కర్ణాటక, 96325 03483
సేవ చేసేందుకు కావలసిన జాలి, కరుణ, సోదరత్వం, విచక్షణ లాంటి గుణాలను చిన్నతనం నుంచే పెంపొందించేలా రూపొందించిన కథల సమాహారమిది. స్వార్థంలేని ప్రార్థన, ఆత్మవిశ్వాసం, గడ్డిపోచ గట్టిదనం, దేవునికి కానుకలు, మాతృదేవోభవ, చీమ సేవ, అహింసో పరమో ధర్మః, ఉపకారం కథలు శాంతి, ప్రేమ ఆవశ్యకతను తెలియజేస్తాయి. ఈ కథల్లోని ఇతివృత్తాలు, పాత్రలన్నీ దైనందిన జీవితంలో ఎదురయ్యేవే!
- తులసి
రచయిత: డా।। భీంపల్లి శ్రీకాంత్; పుటలు: 56; వెల: Rs30; ప్రతులకు: రచయిత, 8-5-38, టీచర్స్ కాలనీ, మహబూబ్నగర్ -509001, 90328 44017; ప్రముఖ పుస్తక కేంద్రాలు
ప్రేమ విశ్వజనీనమైంది. ప్రేమించడమంటే మనలో ఉన్న జ్యోతిని వెలిగించడమే. ‘‘నేనెన్నిసార్లు వికసిత పూవులతో పూజించినా/ నీవెప్పుడూ ఒంటరి శిలలా దూరమవుతుంటావు/ ప్రేమంటే వలచి తలచి తపించే ప్రణయతరువు’’ అంటూ భీంపల్లి శ్రీకాంత్ వెలువరించిందే ఈ ప్రేమ మొగ్గలు. ఈ సంపుటిలో భావ తరంగాల్ని మూడు పంక్తుల్లో వివిధ ప్రతీకలను ఉపయోగిస్తూ ఆకట్టుకునేలా రాశారు రచయిత.
- కార్తీక్