అక్షర సుగంధం కవిత్వం; ర: దేవలపల్లి సునంద; పు: 104; వె: Rs100; ప్ర: పాలపిట్ట బుక్స్, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్పేట, హైదరాబాదు-36, 98487 87284
ఎమర్జెన్సీ జ్ఞాపకాలు వ్యాసాలు; ర: వేదుల నరసింహం; పు: 160; వె: Rs100; ప్ర: సాహిత్య నికేతన్, ఏలూరు రోడ్, గవర్నరుపేట, విజయవాడ -520002, 94406 43348
ఆత్మీయతకు ప్రతిరూపం హల్దేకర్జీ వ్యాసాలు; ప్రచురణ: శ్రీ భోగాది దుర్గాప్రసాద్ స్మరక సమితి; పు: 176; వె: Rs120; ప్ర: సాహిత్య నికేతన్, కేశవనిలయం, హైదరాబాదు, 040 27563236
కవీంద్ర మోక్షం కవిత్వం; ర: రఘుశ్రీ; పు: 110; వె: Rs100; ప్ర: వి.శ్రీలక్ష్మి, 2-1-421, ఫ్లాట్ నం.202, సాయినీ నిలయం, వీధి నం.4, నల్లకుంట, హైదరాబాదు -500004, 92471 08893
మహాభారతం - మతదర్శనం-1; ర: చంద్రశేఖరరెడ్డి చేగిరెడ్డి; పు: 228; విరాళం: Rs220; ప్ర: రచయిత, మొహిదీన్పురం, అర్ధవీడు మండలం, ప్రకాశం జిల్లా-523336, 98663 09589
భారతదేశంలో విదేశీ ముస్లిం పాలన వ్యాసాలు; ర: డా।। బి.సారంగపాణి; పు: 350; వె: Rs250; ప్ర: సాహిత్య నికేతన్, 3-4-852, బర్కత్పుర, హైదరాబాదు, 040 27563236
భారతదేశ చరిత్రలో ఆరు స్వర్ణ పత్రములు వ్యాసాలు; ర: దామోదర సావర్కర్; పు: 368; వె: Rs250; ప్ర: సాహిత్యనికేతన్, ఏలూరురోడ్, గవర్నరుపేట, విజయవాడ, 94406 43348
భూమిపుత్రుడు కవిత్వం; ర: విడదల సాంబశివరావు; పు: 112; వె: Rs100; ప్ర: రచయిత, 3-173/1, పండరీపురం, చిలకలూరిపేట - 522616, గుంటూరు జిల్లా, 98664 00059
చైనాలోని పరిణామాలు భారత-చైనా సంబంధాలపైన...; ర: దేవులపల్లి వెంకటేశ్వరరావు; పు: 296; వె: Rs150; ప్ర: పోరునేల, హైదరాబాదు, 77028 88998, ప్రముఖ పుస్తక కేంద్రాలు
మహాప్రవక్త ముహమ్మద్ ఆధ్యాత్మికం; ర: అలపర్తి పిచ్చయ్య చౌదరి; పు: 100; వె: అమూల్యం; ప్ర: రచయిత, 42/169, జయనగర్ కాలనీ, కడప - 516002, 91770 13845
పద్య సిందూరం పద్యసాహిత్యం; ర: ఐతా చంద్రయ్య; పు: 72; వె: Rs80; ప్ర: రచయిత, ఇం.నం.4-4-11, శేర్పూర, సిద్ధిపేట - 502103, 093912 05299
యక్ష ప్రశ్నలు మహాభారతం; ర: కప్పగంతు వెంకట రమణమూర్తి; పు: 32; వె: Rs35; ప్ర: గ్లోబల్ న్యూస్, బి2, ఎఫ్12, రామరాజా నగర్, సుచిత్రా సెంటర్, సికింద్రాబాదు-67, 92461 65059
విజయ సోపానాలు కవిత్వం; ర: ఎం.ఎన్.విజయకుమార్; పు: 64; వె: Rs50; ప్ర: రచయిత, పాఠశాల సహాయకులు, హిందీ, 14-5-209/5, మధురానగర్, మహబూబ్నగర్, 97031 86814
నారీ సంస్కృతి వ్యాసాలు; ర: డా।। ఎన్.శాంతమ్మ; పు: 114; వె: Rs100; ప్ర: రచయిత్రి, ఫ్లాట్ నం.302, ప్రశాంత్ టవర్స్, రైల్వే స్టేషన్ రోడ్, కర్నూలు-518002, 99080 58172
శాంత తరంగిణి వ్యాసాలు; ర: సి.రోజమ్మ; పు: 56; వె: ఉచితం; ప్ర: రచయిత్రి, హెడ్, సెయింట్ జోసెఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, సుంకేశుల రోడ్, కర్నూలు-518002, 99122 56565
భలే మంచిరోజు న్యూమరిక్కులు; ర: డా।। రమణ యశస్వి; పు: 154; వె: Rs100; ప్ర: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి, విజయవాడ-3, 96188 48470
మహోన్నత శిఖరాలు కవితా మాలిక; ర: వావిలిపల్లి రాజారావు; పు: 184; వె: Rs100; ప్ర: వావిలిపల్లి సుజాత, గాంధీనగర్ వీధి, పొందూరు, శ్రీకాకుళం జిల్లా, 99636 06391
గుమ్మటాలు బాలల గీతాలు; ర: డా।। వడ్డి విజయసారథి; పు: 60; వె: Rs60; ప్ర: సాహిత్య నికేతన్, విజయవాడ, 94406 43348; సాహిత్య నికేతన్, హైదరాబాదు, 040 27563236
రామణీయకం పద్యాలు; ర: డి.రాములు (రాము); పు: 80; వె: అమూల్యం; ప్ర: రచయిత, 24సి-3-22, మంచినీళ్ల తోట, వినాయకగుడి వీధి, పత్తేబాద, ఏలూరు-534002, 94403 76688
మరణానంతర జీవనం ఆధ్యాత్మికం; ర: డా।। పెద్దాడ వేంకట లక్ష్మీ సుబ్బారావు; పు: 34; వె: Rs10; ప్ర: రచయిత, 204, సాయి ఎన్క్లేవ్, లంకవీధి, విజయనగరం, 94410 58797
సంపాదకులు: సాకం నాగరాజ (94403 31016), గంగవరం శ్రీదేవి; పుటలు: 136; వెల:Rs100; ప్రతులకు: రాజాచంద్ర ఫౌండేషన్, తిరుపతి, అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లోనూ..
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంతో సమాంతరంగా, తెలుగు సాహిత్యం, కళలను కూడా కాపుకాసుకునే ప్రయత్నంలో భాగంగా వెలువరించిన ప్రత్యేకసంచిక ఇది. పి.సత్యవతి, అట్టాడ అప్పలనాయుడు, కె.వరలక్ష్మి తదితరుల 20 కథలు, 12 ముఖాముఖీలు, వ్యాసాలు, కవితలు, బాతిక్ చిత్రాలతో అందంగా ఈ సంచికను తీర్చిదిద్దారు. ఇందులోని కథలు ఒకదాన్నిమించి ఒకటి జీవిత సత్యాలను విశదం చేస్తాయి. ముఖ్యంగా ‘బలగం, కన్నగాడి నాన్న, గోదావరి అగ్రహారం’ మనసును కుదుపుతాయి. తన సాహిత్య జీవితపు పునాదులు బాల్యానివే అన్న పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, యదార్థ జీవన దృశ్యాలను కథల్లో ఒడిసిపట్టి, గుండెల్ని కదిలించే కమనీయ కథకురాలు అబ్బూరి ఛాయాదేవి, రాయలసీమ మాండలికాన్ని అక్షరామృతంగా మార్చిన నామిని, సినీసంగీత విజ్ఞాన సర్వస్వం వి.ఎ.కె.రంగారావు తదితరులు తెలుగు భాషాసాహిత్యాల ప్రస్థానంపై వెలిబుచ్చిన అభిప్రాయాలు స్ఫూర్తిదాయకం. సాహిత్యమే ప్రజలను కలపాలన్న సింగమనేని ఆశ నెరవేరాలంటే ఇలాంటి తెలుగు భాషా సాహిత్యాల ప్రత్యేకసంచికలు ఇంకా ఎన్నో వెలువడాలి.
- కనకదుర్గ
రచయిత: డా।। తిరుమల శ్రీనివాసాచార్య; పుటలు: 78; వెల: Rs80; ప్రతులకు: రచయిత, హైదరాబాదు, 040 27196507
పాతిక పుస్తకాలు రచించి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు పొందిన డా।। తిరుమల శ్రీనివాసచార్య మరో పద్యకావ్యమే ఘంటసాల ప్రణుతిమాల. ఇందులో ఘంటసాల జీవిత విశేషాలన్నింటినీ వచనంతో పాటు అద్భుతమైన పద్యాల్లోనూ ఆవిష్కరించారు. ఘంటసాల జననం, విద్యాభ్యాసం, జైలు జీవితం, నాటకరంగ ప్రవేశం, సావిత్రితో వివాహం, ఆ తర్వాత మద్రాసు జీవితం గురించి కూడా ఎంతో సమాచారాన్ని అందించారు. చాలా సులభమైన శైలిలో పద్యాన్ని మళ్లీ మళ్లీ చదువుకునే పద్ధతిలో వచ్చిన కావ్యమిది. ఘంటసాల సంగీత కచేరీలు జరిగిన వివిధ దేశాల పేర్లనూ పద్యాల్లో చక్కగా పొందుపరిచారు. ఘంటసాల యాభైరెండేళ్ల వయసులోనే పరమపదించడం ఓ విషాదం. దాన్ని వివరించే ‘ఘంటసాల నిర్యాణం’ ఘట్టం కంటతడి పెట్టిస్తుంది.
- కన్నోజు లక్ష్మీకాంతం
రచన: డా।। ధారా రామనాథశాస్త్రి; పుటలు:84; వెల:Rs100; ప్రతులకు: ఎ.వి.కె.ఫౌండేషన్ పబ్లికేషన్స్, హైదరాబాదు, 98491 23304
ముల్లోకాలను తన మువ్వల సవ్వడితో మురిపించిన సౌందర్యరాశి ఊర్వశి ప్రణయగాథను సుమధుర కావ్యంగా మలిచి, ప్రముఖ నాట్యావధాని డా।। ధారా రామనాథశాస్త్రి అందించిన గ్రంథమే ఊర్వశి. ఊర్వశీ పురూరవుల ప్రణయగాథను రుగ్వేదం ఆధారంగా ఇందులో నిక్షిప్తం చేశారు. కొంత వాచ్య పద్ధతిలో మరికొంత సూచన పద్ధతిలో ఈ కావ్యాన్ని రూపుదిద్దారు. కథా రూపంలో ఈ కావ్యం వేదం నేపథ్యంతో ప్రారంభమై, నాయికా నాయకుల వేదనతో కొనసాగినప్పటికీ... చివరికి యజ్ఞం కీలకంగా మారడం విశేషం! వివిధ ఖండికలతో సాగే ఆ కావ్యంలో ప్రణయ సన్నివేశాలను మాత్రాచ్ఛందస్సులో చక్కగా ఆవిష్కరించారు కవి. ప్రణయంతోపాటు వైదిక, తాత్త్విక సంబంధ అంశాలనూ జొప్పించడం విశేషం. ఊర్వశిని కావ్యనాయికగా ఉన్నతంగా చిత్రించడంలో సఫలీకృతులయ్యారు.
- దాస్యం సేనాధిపతి