ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడు...
డా.పి.శశిరేఖ
ఇద్దరూ ఇద్దరే
ఆ అయిదుగురు
క్రాంతిదర్శి... సాహితీ రుషి
జ్ఞాన శిఖరం
అలుపెరగని అక్షర శ్రామికుడు
రామకృష్ణ
బాలల కథా వింజామరం
కథా రచయితగా బాల సాహిత్య ఉన్నతికి కృషిచేసిన వేంపల్లి రెడ్డి నాగరాజు 1971 జూన్ 5న కడప జిల్లా సంబేపల్లిలో జన్మించారు. చిన్నకథల ద్వారా జీవన విలువలను ఆవిష్కరించారు. సమకాలీన సమాజ తీరుతెన్నులను విశ్లేషిస్తూ ఉదాత్తమైన కథలు రాస్తూనే పిల్లల భావనా ప్రపంచాన్ని ఆవిష్కరించే కథల మీద దృష్టి పెట్టారు. పూర్తి పాఠం..
విలక్షణ కథా కాంతిరేఖ
కథా రచయితగా, ఆకాశవాణి ప్రయోక్తగా బహుముఖ ప్రతిభ చూపిన జీడిగుంట రామచంద్రమూర్తి 1940లో పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జన్మించారు. వరంగల్లు సహకార బ్యాంకులోనూ, ప్రభుత్వ విద్యాశాఖలోనూ విధులు నిర్వర్తించిన అనంతరం హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేశారు. పూర్తి పాఠం..
ప్రజా పక్షపాతి
ఉద్యోగులుగా ఉన్న వారికి ఉద్యోగ విరమణ తర్వాత అంతవరకు చేసిన పనితో సంబంధం ఉండదు. కానీ వృత్తిలో ఉండే వారికి ఉద్యోగం చాలించిన తర్వాత కూడా ఆ వృత్తిని కొనసాగించే అవకాశం ఉంటుంది. అందరూ అలా కొనసాగించక పోవచ్చు. కానీ వృత్తి కేవలం జీవిక కోసమే కాదు అనుకునేవారు ఉద్యోగం లేకపోయినా వృత్తి లక్షణాలు వదలరు. పూర్తి పాఠం..
తెలుగుతల్లి రూపశిల్పి
తెలుగు శిల్ప కళా నైపుణ్యాన్ని అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించి, మెప్పించిన కళాకారుడు దేవు శంకర్. ‘తెలుగు తల్లి’ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన నైపుణ్యం ఆయనది. కాంస్య, పంచలోహ విగ్రహాల తయారీలో అందెవేసిన చెయ్యి. పూర్తి పాఠం..
నటరాజసేవలో తరించిన సువర్ణ నాట్యకమలం
నాట్యం జీవన వేదం. ఆధ్యాత్మిక శక్తికి, నిశ్చల భావానురక్తికి నర్తనమే ఉత్తమ సాధనమని.. జీవితమంతా నటరాజ సేవలో తరించిన శోభానాయుడు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో 1956లో జన్మించారు. తల్లి సరోజినీదేవి. తండ్రి వెంకన్ననాయుడు. పన్నెండో ఏట తల్లి ప్రోత్సాహంతో పి.లక్ష్మణరెడ్డి దగ్గర నాట్యంలో మెలకువలు నేర్చుకుని... పూర్తి పాఠం..
విప్లవ జ్వాల
సమసమాజాన్ని కాంక్షించిన ఓ కలం అక్షర సమరం ఆగిపోయింది. అభ్యుదయ రచనలతో అణగారిన వర్గాలకు అండగా నిలిచిన వెలుగు వెంకట సుబ్బారావు పరమపదించారు. ప్రకాశం చీరాలకు చెందిన ఆయన ‘రుద్రజ్వాల’ కలంపేరుతో అనేక రచనలు చేశారు. పూర్తి పాఠం..
చైతన్య రవళి’ కవితా సంపుటి, హనుతత్త్వ చంద్రిక, వ్యాసమణిహారం, శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి జీవిత చరిత్ర, కర్నూలు జిల్లా స్వాతంత్య్రోద్యమ చరిత్ర (అముద్రితం) తదితర రచనలు చేసిన హీరాలాల్... కర్నూలు సాహితీ సిగలో మెరిసే జాబిల్లి. పూర్తి పాఠం..
సౌజన్యశీలమైన పాండిత్యానికి మరో పేరు కె.వి.రాఘవాచార్యులు. వేదాంత దేశికుల రచనల విశిష్టతలను తెలుగువారికి పరిచయం చేసిన ఘనత ఆయనది. ‘వేదాంత దేశికుల పాదుకా సహస్ర వ్యాఖ్య’ రచన రాఘవాచార్యుల వ్యాఖ్యాన సామర్థ్యానికో నిదర్శనం. పూర్తి పాఠం..
కవిత్వం రాసేవాళ్లందరూ కవిత్వాన్ని ప్రేమించరు. ఇక్కడ ప్రేమించడం అంటే తన పర భేదాలకు అతీతంగా కవితామధురిమలను ఆస్వాదించడం... ఆ రుచి తెలియని వారికి దాన్ని చవిచూపించడం. కానీ, చాలామంది కవులు తమ కవితలను మాత్రమే ప్రేమిస్తారు. పూర్తి పాఠం..