ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడు...
డా.పి.శశిరేఖ
ఇద్దరూ ఇద్దరే
ఆ అయిదుగురు
క్రాంతిదర్శి... సాహితీ రుషి
జ్ఞాన శిఖరం
అలుపెరగని అక్షర శ్రామికుడు
రామకృష్ణ
కవిత్వం రాసేవాళ్లందరూ కవిత్వాన్ని ప్రేమించరు. ఇక్కడ ప్రేమించడం అంటే తన పర భేదాలకు అతీతంగా కవితామధురిమలను ఆస్వాదించడం... ఆ రుచి తెలియని వారికి దాన్ని చవిచూపించడం. కానీ, చాలామంది కవులు తమ కవితలను మాత్రమే ప్రేమిస్తారు. పూర్తి పాఠం..
విలక్షణ సాహిత్య పథగామి
పరిశోధకుడిగా ఉర్దూ, తెలుగు సాహిత్యాల్లో విశేష కృషిచేసిన షేక్ మహమ్మదు ముస్తఫా.. రుబాయీ కవిగా ప్రసిద్ధులు. కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించారు. అనిబిసెంట్ పురపాలక ఉన్నత పాఠశాలలో సెకండరీ విద్యను పూర్తిచేశారు. గుడివాడ ఆంధ్ర నలందలో సంస్కృతాంధ్ర సాహిత్యాలను అధ్యయనం చేశారు. పూర్తి పాఠం..
మంచి పుస్తకంలాంటి మనిషి
వృత్తిరీత్యా న్యాయవాది అయినా సాహితీ పఠనం, పర్యావరణం మీద అవగాహన కల్పించడం, వ్యాస రచన లాంటి ప్రవృత్తులతో అర్థవంతమైన జీవితాన్ని గడిపారు గోగుల విజయకుమార్. తిరుపతికి చెందిన ఆయన 1945 ఆగస్టు 30న జన్మించారు. పూర్తి పాఠం..
సలక్షణ సాహితీ సుమగంధం
పరిశ్రమ కార్యనిర్వాహకురాలిగా, సాహిత్య సృజనశీలిగా విశేష కృషిచేసిన సోమరాజు సుశీల 1945 ఏప్రిల్ 28న తూర్పుగోదావరిజిల్లా సిద్ధం గ్రామంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి రసాయనశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. పూర్తి పాఠం..
సంస్కృత భాషలో ఉన్న వెలుగును తెలుగుకు అందించిన తెలుగువెలుగు ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడు. పూర్తి పాఠం..
పద్య, గద్య కవితా ప్రవీణుడు
ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామంలో 1952లో పాపయ్యశాస్త్రి జన్మించారు. విద్యాభ్యాసం తర్వాత నాటి ఖమ్మం జిల్లా వరరామ చంద్రాపురంలో హిందీ పండిట్ ఉద్యోగంలో చేరారు. అయితే, మాతృభాష మీద మక్కువతో తెలుగు ఉపాధ్యాయుడయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకుడిగా తెలుగు పాఠాలు బోధించారు. పూర్తి పాఠం..
అక్షర తపస్వి
కథలు, పద్య నాటకాల రచయితగా, నవలాకారుడిగా, విమర్శకుడిగా పలు ప్రక్రియల్లో ప్రతిభను చాటుకున్న అరుదైన సాహితీమూర్తి డా।। ఎన్.రామచంద్ర. కడప జిల్లా పులివెందుల తాలూకా రామిరెడ్డిపల్లిలో 1939లో సామాన్య రైతు కుటుంబంలో ఆయన జన్మించారు. చాలా ఒడిదొడుకుల మధ్య రామచంద్ర పాఠశాల విద్య సాగింది. పూర్తి పాఠం..
సాహితీ శేఖరుడు
తెలంగాణ తొలితరం సాహితీవేత్తల్లో ఒకరైన ఆచార్య మడుపు కులశేఖరరావు తెలుగు సాహిత్యం, చరిత్ర పరిశోధనలో విశేష కృషి చేశారు. తెలుగు సాహిత్య చరిత్రను ఆంగ్లంలోకి అనువదించారు. ఇబ్రహీంపట్నం తాలూకా నక్కర్త గ్రామంలో నవంబరు 14, 1932న కులశేఖరరావు జన్మించారు. పూర్తి పాఠం..
బాలల కథా కేతనం
‘చందమామ’ పత్రికలో భేతాళ కథలు అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే పేరు టి.జి.ఆర్.ప్రసాద్. పూర్తి పేరు తాటిచెర్ల గురు రామ ప్రసాద్. అయిదు వందలకు పైగా బాలల కథలు రాసి, బాలసాహిత్యంలో తనదైన ముద్ర వేసుకున్న ప్రతిభాశాలి ఆయన. పూర్తి పాఠం..