ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడు...
డా.పి.శశిరేఖ
ఇద్దరూ ఇద్దరే
ఆ అయిదుగురు
క్రాంతిదర్శి... సాహితీ రుషి
జ్ఞాన శిఖరం
అలుపెరగని అక్షర శ్రామికుడు
రామకృష్ణ
రంగస్థల రుషి
అద్భుతమైన నటన, దర్శకత్వ వైదుష్యాలకు తోడు పరిశోధన, రచనా నైపుణ్యాలతో తెలుగు నాటకానికి నూతన జవసత్త్వాలు అందించిన నాటకబ్రహ్మ ఆచార్య మొదలి నాగభూషణ శర్మ. ఆయన నటుడు, రచయిత, దర్శకుడు, ప్రయోక్త, పరిశోధకుడు, అధ్యాపకుడు, పరిశోధన మార్గదర్శకుడు, ఉపన్యాసకుడు, నట శిక్షకుడు, విమర్శకుడు. పూర్తి పాఠం..
బహుముఖ ప్రజ్ఞాజ్యోతి
కాన్వాసు మీద అపురూప వర్ణచిత్రాలను సృష్టించి... నాటక రచయిత, దర్శకుడిగానూ రాణించిన వ్యక్తి అబ్బూరి గోపాలకృష్ణ. అనారోగ్యంతో బాధపడుతూ జనవరి 31న విశాఖపట్నంలో కన్నుమూశారు. పూర్తి పాఠం..
అలుపెరగని బాటసారి
తుదిశ్వాస విడిచేవరకూ తెలుగు భాష, సాహిత్యాలను వెలిగించడానికే పరితపించిన బహుముఖ ప్రజ్ఞాశాలి పోతుకూచి సాంబశివరావు. దాదాపు అయిదు వేల వరకూ కవిసమ్మేళనాలు, రచయితల గోష్టులు, పుస్తకావిష్కరణ సభలు నిర్వహించిన ఘనత ఆయనది. పూర్తి పాఠం..
రంగస్థల మేరునగం
పౌరాణిక నాటకాలతో దేశవ్యాప్తంగా ఖ్యాతిగడించిన ప్రముఖ రంగస్థల కళాకారులు మద్దాల రామారావు. తన అసమాన నటనా కౌశలంతో విభిన్న పాత్రలను పండించిన ఆయన 1927లో జన్మించారు. ఎనిమిదేళ్ల వయసులో రంగస్థలం మీదికి అడుగు పెట్టారు. పూర్తి పాఠం..
ఓరుగల్లు కీర్తిప్రభ
‘ఓరుగల్లు అసలు చరిత్ర’ పేరిట వరంగల్లు నగర చరిత్రను అక్షరీకరించిన పరిశోధకుడు ఆచార్య హరిశివకుమార్. ఏప్రిల్ 19, 1942న జన్మించిన ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పట్టా పొందారు. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యాపకుడిగా, విభాగాధిపతిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా పనిచేశారు. పూర్తి పాఠం..
అనువాద సాహితీస్రష్ట
ఆయన ఎంతో వేగంతో, అంతే నిబద్ధతతో జీవిత చరమాంకం వరకూ రచనలు చేస్తూనే ఉన్నారు. యతిరాజులు మాతృభాష తెలుగుతో పాటు తమిళ, హిందీ, ఆంగ్లం, సంస్కృత భాషల్లో నిష్ణాతులు. తన పేరుతోనే కాక అరుణానంద్ పేరిటా రచనలు చేశారు. అయన తమిళనాడులోని గుడియాత్తంలో 1935 ఆగస్టు 4న జన్మించారు. పూర్తి పాఠం..
బహుభాషా సాహితీవేత్త
భగవద్గీత, రామాయణాలను ఉర్దూలోకి అనువదించిన ప్రజ్ఞ ఈగ కృష్ణస్వామిది. భవన నిర్మాణ రూపశిల్పి(ఆర్కిటెక్ట్)గా పనిచేస్తూనే తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషల్లో అనేక పుస్తకాలు రాసిన సాహితీవేత్త ఆయన. పూర్తి పాఠం..
అవధాన శిఖరం
కడప జిల్లా ప్రొద్దుటూరులో నవంబరు 12, 1929న సుబ్బన్న జన్మించారు. 1950లో తొలి శతావధానం చేశారు. 1997 వరకూ అవధానాలు చేస్తూనే వచ్చారు. నాభీకుహరం నుంచి వెలువడే ఈయన పద్యపఠనం వేదనాదాల్ని తలపిస్తుంది. పూర్తి పాఠం..
గీత మోహనం
మోహన్ వేసిన రాజకీయ కార్టూన్లూ, విప్లవ పోస్టర్లూ, కార్మిక కర్షక వీరులూ, దుష్టసామ్రాజ్యవాదులూ వారి తాబేదార్ల యిన రాజులూ, పెట్టుబడిదార్లూ, ఫ్యూడల్ ప్రభువుల పరారీబొమ్మలు సామాజిక చైతన్యంతో ఊపేశాయి. పూర్తి పాఠం..